మాతృ భిక్ష 🙏
ఇది చాలా ఏళ్ల క్రితం భారతదేశంలో జరిగిన
యధార్థ సంఘటన అంటారు ! నిజమైనది అయి వుండవచ్చు.
"ఆ వూరిలో వెనుకబడిన కులానికి చెందిన 'ధని ' అనే ఒక స్త్రీ వుండేది, ఆమె చాలా దయగలది.
ఆమె గ్రామ కమ్మరి భార్య ! మంత్రసాని పని చేస్తుంది.
ఒకసారి ఆ వూరిలో ఒక బ్రాహ్మణుని యింట్లో ఒక మగ బిడ్డ పుట్టాడు.
ఈ బిడ్డ పుట్టడంతో, ఆ ఊరి వాతావరణంలో
ఒక మార్పు వచ్చినట్లుగా అయ్యింది -
పక్షుల కిలకిలరావాలు వినిపించాయి!
పువ్వులు వికసించాయి!
ఊళ్ళో చెట్లకు కొత్త ఆకులు రావడం మొదలైంది.
ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రశాంత పరిచే విధంగా వాతావరణం మారింది.
ఆ బిడ్డ పుట్టుక ఆనందాన్ని తీసుకొచ్చింది, కుటుంబం మొత్తానికి యింకా ఎక్కువ
సంతోషాన్ని తెచ్చింది.
'ధని ' అక్కడ మంత్రసానిగా, సంరక్షకురాలిగా పని చేయడం ప్రారంభించి, ఆ బిడ్డను చూసుకునేది.
కాలక్రమేణా..
ఆమెకు ఆ శిశువుతో ఒక అనుబంధం ఏర్పడింది.
'ధని ' ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేది.
ఆ పిల్లవాడు కూడా ఆవిడతో ఒక భిన్నమైన,
మాతృ బంధాన్ని పెంచుకున్నాడు.
ధనీ కి ఆ బిడ్డతో చెప్పలేని ఒక భావోద్వేగ బంధం ఏర్పడింది.
చూస్తూండగా ఆ అబ్బాయికి 9 ఏళ్లు వచ్చాయి. ఒకరోజు మంత్రసాని ఆ బ్రాహ్మణ బాలుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపించింది.
ఒక తల్లి ఏదో కోరిక ను కోరుతున్నట్లుగా, పిల్లవాడు ఆమెకు వాగ్దానం చేస్తున్నట్లుగా కనిపించింది.
తర్వాత ఆ మంత్రసాని చెమ్మగిలిన కళ్లతో
అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కొన్నాళ్లకు, ఆ బాలుడి కుటుంబ సభ్యులు అతనికి 'ఉపనయన' కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
ఆ కుర్రవాడి అన్నగారు ఆ ఆచారం,
దాని ప్రవర్తనా నియమావళి యొక్క అంతర్భావాల గురించి
అతనికి సూచనలు యిస్తున్నాడు.
"మాతృ భిక్ష (తల్లి నుండి భిక్ష)" అనేది వుపనయనంలో ఒక ముఖ్యమైన కార్యం.
మగ శిశువుకు ఒక
నిర్దిష్ట వయస్సు వచ్చినప్పుడు, అతనికి పవిత్రమైన దారాన్ని
[ యజ్ఞోపవీతాన్ని శరీరంపై వికర్ణంగా] ధరింపజేయడం బ్రాహ్మణులలో ఒక ముఖ్య ఆచారం.
గాయత్రి మంత్రం కూడా అతనికి చెప్పబడుతుంది.
ఈ వేడుక బాలుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భాలలో ఒకటి.
ఎందుకంటే...
ఈ వేడుక తర్వాత
మాత్రమే బాలుడు సంపూర్ణ బ్రాహ్మణుడు అవుతాడని ఒక నమ్మకం.
ఈ సమయంలో, బాలుడు తన తల్లి నుండి మొదటి భిక్ష (ఒక పాత్రతో అన్నం, పండ్లు) అందుకుంటాడు.
తల్లే అతనికి మొదటి ఆశీర్వాదం యిస్తుంది. ఇది ప్రతి తల్లికీ చాలా గర్వకారణమైన విషయం.
అన్నయ్య యీ ఆచారం గురించి చెబుతుంటే..
ఆ పిల్లవాడు యిలా అన్నాడు..
"నేను ధని అమ్మ నుండి మొదటి భిక్ష తీసుకుంటాను, అలా నేను ఆమెకు వాగ్దానం చేసాను."అని.
వారిది సనాతన కుటుంబం అయినందున, అన్నయ్య భయపడుతూ యిలా అన్నాడు:
"అది చాలా అసాధారణమైనది, ఆ మంత్రసాని ధని అమ్మ వద్దనుండి మొదటి భిక్ష తీసుకుంటే, గ్రామ పండితుల మధ్య మన
గౌరవం పోతుంది."
ఆ అమాయకపు పిల్లవాడు వెంటనే యిలా బదులిచ్చాడు ..
"సోదరా, యీ వేడుకలో ధని అమ్మకి నా తల్లిగా హక్కు యిస్తానని నేను వాగ్దానం చేసాను,
ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే, నేను ఈ పవిత్ర యజ్ఞోపవీతానికి
అర్హుడిని కాదు."
అన్నగారు యీ మాటలు నమ్మలేకపోయాడు.
త్వరలోనే, ఆ పవిత్రమైన రోజు వచ్చింది.
మంత్రోచ్ఛారణలు, శ్రావ్యమైన సన్నాయి వాయిద్యాల మధ్య వేడుక చక్కగా ప్రారంభమైంది.
కుటుంబ సభ్యులందరూ, చుట్టుపక్కల వారందరూ చాలా ఉత్సాహంగా ఆ వేడుకలో పాల్గొనడం ప్రారంభించారు.
ఈ సంబరాల్లో, వేడుక హడావిడిలో, ఇంతకు ముందు వారిరువురికీ జరిగిన
చర్చను తమ్ముడు మరిచిపోయాడేమో అని అన్నగారు అనుకున్నాడు.
మరి కొద్దిసేపట్లో " మాతృ భిక్ష" ఆచార కార్యక్రమం ప్రారంభం కానుంది.
కుర్రవాడి తల్లి, యితర స్త్రీలు అందరూ
‘భిక్ష' యివ్వడానికి సిద్ధం అయ్యారు.
కానీ, భిక్ష యివ్వడానికి కొంత బియ్యం, పండ్లతో దూరంగా
ఒక మూల నిలబడి వున్న ' ధని ' అమ్మ వైపు ఆ కుర్రవాడు ..
చేతిలో బిక్ష సంచితో ...నడుస్తూ వెళ్లగా,
అక్కడి వారందరూ అలా చూస్తూ వుండిపోయారు.
బ్రాహ్మణ పండితులందరూ చూస్తూండగా...
స్త్రీలందరూ నిర్ఘాంతపోయి
నిలబడిపోగా...సమాజంలో అంటరానితనం
తారాస్థాయిలో వున్న సమయంలో,
ఆ అమాయక బాలుడు,
తాను ' ధని' అమ్మకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లుగా..ఆమె ముందు వంగి..
ఒక వెనుకబడిన కులానికి చెందిన స్త్రీ
అయిన ధని నుండి మొదటి "మాతృ భిక్ష"ను అందుకున్నాడు!
కళ్ళలో నీళ్లతో, హృదయంలో మాతృప్రేమ
వుప్పొంగుతూండగా, ధని ఆ బిడ్డకు తన ఆశీస్సులు యిచ్చింది.
ఆ నిరుపేద తల్లికి, ఆమె జీవితంలో వున్న కోరిక యిదొక్కటే.
ఈ వేడుకలో అటువంటి సంఘటన జరిగినప్పుడు, దాని గురించి పెద్ద రభస, అలజడి జరుగుతుందని అందరూ వూహించారు !
కానీ అలాంటిదేమీ జరగలేదు.
ఆ వేడుకకు సంబంధించిన ప్రధాన పండితుడు మాత్రం ఆ పిల్లవాడి, "సత్య వాక్య పరిపాలనం" గురించి ప్రశంసించి, హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.
ఈ చిరస్మరణీయమైన నిశ్శబ్ద విప్లవం పశ్చిమ బెంగాల్లోని
ఒక చిన్న గ్రామంలో జరిగింది !
ఈ నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువచ్చిన బాలుడు "గంగాధర్ ఛటోపాధ్యాయ"
అతనే తరువాత రామకృష్ణ పరమహంసగా ప్రాచుర్యం పొందాడు.
ఈ అన్యోన్యమైన ప్రేమ, ఆప్యాయతల బీజం ఒక పేద స్త్రీ యొక్క మాతృ ప్రేమ నుండి అతనిలో వుద్భవించి వుండచ్చు.
బహుశా అదే రామకృష్ణ పరమహంస యొక్క
ఔన్నత్యానికి పునాది వేసి ఉంటుంది.
తరువాతి సమయంలో స్వామి వివేకానంద ఆయన ప్రధాన శిష్యుడు అయ్యాడు.
మనలో నిజమైన ప్రేమ పెంపొందితే, అందరూ సమానంగా కనిపిస్తారు. ప్రేమ అంతిమ లక్ష్యానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది, ఎందుకంటే ప్రేమ ఒక అత్యుత్తమమైన శక్తి.
ప్రేమను పెంపొందించు కోవడానికి ఏకైక మార్గం నిరంతర స్మరణ.
♾️
మీరు ప్రేమతో మాత్రమే హృదయాలను గెలుచుకోగలరు. అంతే గానీ హింసతో కాదు.
దానికి ఇంకో మార్గం లేదు.🙏🙏🙏🙏
Post a Comment